Friday, September 20, 2024

TG: పాలమాకుల గురుకులంలో సమస్యలను ప‌రిష్క‌రించాలి… హరీష్ రావు

(ప్రభ న్యూస్ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి) : రాజేంద్రనగర్ నియోజకవర్గం పాలమాకుల బాలిక గురుకుల పాఠ‌శాల‌లో స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని మాజీ మంత్రులు హరీష్ రావు, సబితారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ యువ నాయకుడు కార్తీక్ రెడ్డితో క‌లిసి మాజీ మంత్రులు పాల‌మాకుల గురుకుల పాఠ‌శాల‌ను సందర్శించారు. అక్కడి సమస్యలపై విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు.

పురుగుల అన్నం తినలేకపోతున్నామని గురుకులం బాలికలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. గురుకులంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రులు తెలుసుకున్నారు. విద్యా శాఖను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా పెట్టడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement