Sunday, September 8, 2024

TG: ఆగస్టు 2 వరకు ప్రభుత్వానికి డెడ్ లైన్… కేటీఆర్

కాళేశ్వరం పంపులు ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలి
లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50వేల మంది రైతులతో వచ్చి మేమే పంపులు ఆన్ చేస్తాం
కేటీఆర్ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్టిమేటం
కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డను సందర్శించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల బృందం


మహాదేవపూర్ (ప్రభ న్యూస్) : తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు ఆగస్టు 2 లోగా పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీరందించాల‌ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు పై చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం, మాజీ ప్రజా ప్రజలతో కలిసి శుక్రవారం కాలేశ్వరం కన్నెపల్లి, మేడిగడ్డను సందర్శించారు.

- Advertisement -

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… ఈ ఆగస్టు 2లోపు కన్నె పెళ్లి లక్ష్మీ పంప్ హౌస్ లోని పంపులు ఆన్ చేసి రైతాంగానికి నీరందించ‌క‌పోతే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 50వేల మంది రైతులతో కలిసి ప్రాజెక్టు వద్దకు వెళ్లి మేమే పంపులు ఆన్ చేసి రైతులకు నీరందేలా చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు నినందించకుండా రైతులపై కక్ష సాధింపు చర్యకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పగా ప్రతీకారం ఉంటే కేసీఆర్ తో చూసుకోవాలని, కానీ అమాయకులైన రైతుల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని ప్రశ్నించారు. బ్రహ్మాండమైన ప్రాజెక్టు నిర్మించి ఇస్తే వాటిని ఉపయోగించుకోకుండా లేనిపోని రాద్ధాంతం చేస్తున్నార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement