Friday, September 20, 2024

Tension – ఖమ్మంలో బిఆర్ఎస్ నేత‌ల కార్ల‌పై రాళ్ల దాడి

ఖ‌మ్మం వ‌ర‌ద ప్రాంతాల‌లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన బిఆర్ఎస్ నేత‌ల వాహ‌నాల‌పై రాళ్ల దాడి జ‌రిగింది.. మాజీ మంత్రులు స‌బితా,హారీశ్, పువ్వాడ‌, జ‌గ‌దీష్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజ‌య్ కుమార్ లు ప్ర‌యాణీస్తున్న వాహ‌నాల‌పై ఒక్క‌సారిగా రాళ్ల వ‌ర్షం కురిపించారు.. దీంతో అక్క‌డ ఒక్క‌సారిగా ఉద్రిక్త‌తలు చోటు చేసుకున్నాయి.. ఈ రాళ్ళ దాడిలో విరిగిన బీఆర్ఎస్ కార్యకర్త సంతోష్ రెడ్డి కాలు విరిగింది.. దీంతో ఆత‌డిని హాస్ప‌ట‌ల్స్ కు త‌ర‌లించారు.. పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి ప‌రిస్థితిని అదుపు చేశారు.. అయితే ఈ రాళ్ల‌దాడి కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు చేశార‌ని బిఆర్ఎస్ నేత‌లు ఆరోపించారు.. దీనిపై మ‌రింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement