Friday, October 18, 2024

TG: స‌చివాల‌యం ద‌గ్గ‌ర ఉద్రిక్త‌త‌…

నిరుద్యోగులకు మద్దతుగా బీసీ జనసభ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చింది. ఇక, బీసీ జనసభ పిలుపుతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మూడు విభాగాల పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సెక్రటేరియేట్ నాలుగు గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. ఎక్కడికక్కడ నిరుద్యోగులను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. సెక్రటేరియేట్ పరిసర ప్రాంతాలన్నీ పోలీసుల బస్సులు, ఐచర్‌లు, పెట్రోలింగ్ వాహనాలు, పోలీసుల ఉన్నతాధికారుల వాహనాలతో నిండిపోయాయి.

పోలీసుల మోహరింపు, మరో వైపు బీసీ జనసభ సభ్యులు సెక్రటేరియట్‌కు చేరుకుంటుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీసీ జనసభ నేత రాజారాంయాదవ్, సహా పలువురు ముఖ్యనేతలు సెక్రటేరియట్‌కు నిరుద్యోగులు తరలిరావాలని పిలుపునివ్వడంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

సెక్రటేరియట్ వద్ద పోలీసులు వాటర్ కెనాన్‌లను సైతం సిద్ధంగా ఉంచారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్‌లో ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించనున్నారు. రోడ్లపై వస్తున్న వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచారు. సాధారణ పౌరులుగా వచ్చి ఆందోళనకు దిగుతారా అనే కోణంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement