Monday, October 21, 2024

HYD | నందినగర్ లో టెన్షన్… కేటీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు

హైద‌రాబాద్: హైదరాబాద్ లోని నందినగర్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రూప్ 1 పరీక్షలు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు.

బంజారాహిల్స్ నందిన‌గ‌ర్‌లోని కేటీఆర్ ఇంటి వ‌ద్ద పోలీసులు భారీగా మోహ‌రించారు. భారీగా పోలీసుల‌ను మోహ‌రించి, ప‌దుల పోలీసు వాహ‌నాల‌ను ఉంచారు. నందిన‌గ‌ర్ ప్రాంత‌మంతా పోలీసు బ‌లగాల‌తో నిండిపోయింది. గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని కోరుతున్న అభ్యర్థుల తరఫున విపక్షాలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కాసేపట్లో పరీక్ష ప్రారంభం కాబోతుండడంతో రాజకీయ నిరసనలు జరిగి, పరీక్షలకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement