Friday, September 20, 2024

Tension – మల్లారెడ్డి వ‌ర్సిటీలో ఉద్రిక‌త్త‌ – ఫ‌ర్నీచ‌ర్ ధ్వంసం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించిన మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. రెండు రోజుల కింద‌ట ఒక విద్యార్థి అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీనిపై విద్యార్థి సంఘాలు ఆందోళ‌న‌కు దిగాయి. ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, విద్యార్థి సంఘాలు కాలేజీలోకి ప్రవేశించి నిరసనలు తెలిపారు. విద్యార్థి మరణంపై కాలేజీ యాజమాన్యం స్పందించాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీ ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు.

త‌ర‌గ‌తులు బ‌హిష్క‌రించిన విద్యార్థులు
విద్యార్థులు త‌ర‌గ‌తుల‌ను బ‌హిష్క‌రించి మైదానంలో బైఠాయించారు. విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ వద్దకు చేరుకున్న పేట్ బాషీరాబాద్ పోలీసులు విద్యార్థి సంఘ నేతలను మందలించే ప్రయత్నం చేశారు. ఘటనపై పోలీసులు వివ‌రాలు సేక‌రిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement