Monday, July 1, 2024

Telangana – టెన్త్ అడ్వాన్స్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు వెల్ల‌డి …

తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 46,731మందికి గాను 34,126మంది ( 73.03శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ దరఖాస్తులకు జులై 8వరకు అవకాశం కల్పించారు. ఈ ఫ‌లితాల‌ను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ bse.telangana.gov.in లో చూసుకోవ‌చ్చు.

కాగా, వార్షిక పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్ 3 నుంచి 13వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఇక పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 93.23 శాతం బాలికలు, 89.42 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. 3,927 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత కాగా.. ఆరు పాఠశాలల్లో జీరో శాతం ఉత్తీర్ణత న‌మోదైంది. ఇక గ‌తేడాది వార్షిక పరీక్షలో 89.60 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా.. ఈ ఏడాది 91.31 శాతానికి పెరిగింది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement