Saturday, September 21, 2024

TG: తెలంగాణ త‌ల్లి విగ్ర‌హా ఏర్పాటు.. భూమిపూజ చేసిన రేవంత్

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు.

సెక్రటేరియెట్​ భవన ప్రధాన ద్వారం ముందు భాగంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement