Sunday, September 15, 2024

Telangana – రేపు రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల … రేవంత్ రెడ్డి

రూ.లక్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి నిధులు…
అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి…
రేపు సభలో రుణమాఫీపై చర్చ పెట్టే ఆలోచనలో సర్కార్…

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామన్న హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పుడు రెండో విడత రైతు రుణమాఫీకు సిద్ధమైంది. ఈ నెలాఖరులో రెండో విడత, వచ్చే నెల మొదటి వారంలో మూడో విడత నిధులు విడుదల చేస్తామన్న ప్రకారమే రేపు నిధులు విడుదల చేయ‌నున్న‌ట్లు ముఖ్య‌మంత్ర రేవంత్ రెడ్డి నేడు అసెంబ్లీలో ప్ర‌క‌టించారు.

రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేసే విషయమై ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. ల‌క్షన్నర లోపు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి రేపు నిధులు జ‌మ కానున్నాయి.. ఇక రెండో విడుత రుణ మాఫీ నిధుల‌ను అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ విడుద‌ల చేయ‌నున్నారు..

- Advertisement -

రుణ‌మాఫీపై రేపు చ‌ర్చ

రేపు సభలో రుణమాఫీ పై తెలంగాణ సర్కార్ చర్చ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం. రేపు కూడా సభలో 19 శాఖల పద్ధులపై చర్చ నేపథ్యంలో ప్రకటన ఐనా చేయాలని సర్కార్ భావిస్తుంది.

తొలి విడ‌త‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు..

కాగా.. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు మాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో దీనిపై మంత్రి తుమ్మల స్పందించారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశారు. సాంకేతిక సమస్యల కారణంగా కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు పూర్తిగా జమ కావడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని దీనిపై మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ అవుతుందని భావించగా కొంత మంది రైతుల ఖాతాల్లో సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. రుణమాఫీ సొమ్మును రిజర్వ్‌ బ్యాంకు ఈ-కుబేర్‌ విధానంలో జమ చేస్తున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 17 వేల 877 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 84.94 కోట్ల రూపాయలు జమ కాలేదన్నారు. ఆ నిధులు ఆర్‌బీఐ వద్దే ఉన్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement