Sunday, October 20, 2024

Telangana – డిప్యూటీ సెక్రటరీలు – ఆరుగురికి ప‌దోన్న‌తులు

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఆరుగురు అసిస్టెంట్ సెక్ర‌ట‌రీల‌కు డిప్యూటీ సెక్రటరీలుగా పదోన్నతులు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పదోన్నతులు పొందిన ఆరుగురికి పోస్టింగులు ఇచ్చారు. ఆర్‌.శోభన్‌బాబుకు పురపాలక, పట్టణాభివృద్ధి, ఇ.రాజేంద్రప్రసాద్‌కు విద్య, ఎస్‌.లక్ష్మీబాయికి గిరిజన సంక్షేమం, ఎస్‌.సత్యనారాయణకు మహిళా శిశు సంక్షేమ, ఎ.కల్యాణికి పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్‌.శ్రీనివాస్‌కు రవాణా, రోడ్లు-భవనాల శాఖలలో డిప్యూటీ సెక్రటరీలుగా నియ‌మించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement