Thursday, July 4, 2024

Telangana రైతులు ఆత్మ‌హ‌త్య‌లేనా …. మీ ప్ర‌జాపాల‌నలో మార్పు …కెటిఆర్


ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో రైతు భోజడ్ల ప్రభాకర్ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తన భూమిని కొంత మంది కబ్జా చేశారని ఎస్ఐ, ఎమ్మార్వోకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని సెల్ఫీ వీడియోలో రైతు తెలిపాడు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీం భట్టి స్పందించి తమ ఫ్యామిలీకి న్యాయం చేయాలని రైతు ప్రాణాలు విడిచాడు. ఇక ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించగా.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలో రైతుల దుస్థితి.. కాంగ్రెస్ ప్రవేశపెట్టి ‘మార్పు’ ఇదే అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రైతు సెల్ఫీ వీడియో ట్యాగ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement