Friday, September 6, 2024

Telangana – న‌ర్సింగ్ ఉద్యోగుల‌కు జీతాలేవీ… రేవంత్ సర్కార్ ను నిలదీసిన హరీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన రిక్రూట్‌మెంట్ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుందని విమర్శించారు. ఉద్యోగిలిచ్చిన్లు క్రెడిట్ కొట్టిసిన రేవంత్ ప్రభుత్వం వారికి జీతాలు మాత్రం ఇవ్వటం లేదన్నారు. గత నాలుగు నెలలుగా వారికి జీతభత్యాలు ఆగిపోయాయని ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది తప్ప, వారి జీత భత్యాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో నియమితులైన 4 వేల మంది నర్సింగ్ ఆఫీసర్లకు జీతాలు అందక అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లులేని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలును తక్షణం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను.’ అనిహరీశ్ రావు ట్వీట్‌లో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement