Saturday, October 19, 2024

Telangana | ఈనెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా

ఈనెల 23వతేదీన జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన 23వ తేదీకి బదులుగా 26వ తేదీకి కేబినెట్ సమావేశం కాబోతుంది. కేబినెట్ సమావేశంలో హైడ్రాయ మూసీ నది ప్రక్షాళన, రైతు భరోసా విధి విధానాలు, శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు తెలిసింది.

అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఒక ఎకరానికి రూ. 15వేలు అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైతు భరోసా మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది. వివిధ వర్గాలతో చర్చలు జరిపిన కేబినెట్ సబ్ కమిటీ.. రైతు భరోసా గైడ్ లైన్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపైనా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement