Sunday, September 8, 2024

Telangana Assembly – భట్టి పద్దు పై చర్చ నేడే

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఒక్క రోజు విరామం తర్వాత నిఫిన్ తిరిగి సమావేశం కానుంది. గురువారం ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో దానిపై సభ్యులు అధ్యయనం చేసి రేపటి సభలో చర్చలో పాల్గొనేందుకు శుక్రవారం సెలవు ఇచ్చారు.

నేటి ఉదయం 10గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి, నేరుగా బడ్జెట్‌ పద్దుపై చర్చకు అవకాశం కల్పించారు.

దీంతో ఉభయ సభల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇస్తారు. మొదట శాసనసభలో సమాధానం ఇచ్చిన తర్వాత, మండలిలోనూ డిప్యూటీసీఎం సమాధానమిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement