Friday, September 20, 2024

Telangana – కౌంటింగ్ కు సర్వం సిద్ధం

తెలంగాణలోనూ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక జరిగింది. మెుత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 525 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.

- Advertisement -

పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించేందుకు 276 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తరువాత ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఇందుకోసం 120 కౌంటింగ్ హాల్స్, 1,855 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 18 నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కోసం 14వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.

హైద‌రాబాద్,సికింద్రాబాద్ ల‌లో..

హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల నియోజకవర్గాల పరిధిలో మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జంట నగరాల్లోని 15 అసెంబ్లీల ఓట్లను వేర్వేరుగా లెక్కించాలని ఇప్పటికే హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపఎన్నిక ఫలితాన్ని మాత్రం కంటోన్మెంట్ బోర్డు సీఈవోగా పర్యవేక్షణ చేయనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల పరిధిలోని రిటర్నింగ్ అధికారులు అసెంబ్లీ స్థానాల ఓట్లను రౌండ్లవారీగా తెప్పించుకుని తుది ఫలితాన్ని వెలువడిస్తారు.

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉండడంతో అక్కడ 20 టేబుళ్లపై కౌంటింగ్ చేయనున్నారు. 216 టేబుల్స్ పై కౌంటింగ్..మిగిలిన 14 స్థానాల ఓట్లను 14 టేబుళ్లపై కలిపి మొత్తం 216 టేబుళ్లపై ఓట్లను అధికారులు లెక్కించనున్నారు.

హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి తపాలా ఓట్లకు 14, సికింద్రాబాద్ తపాలా ఓట్లకు 10 కలిపి మొత్తం 24 టేబుళ్లపై లెక్కింపు చేయనున్నారు. ఈ లెక్కింపులో మొత్తం 1000 మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఈ లెక్కింపు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేయనున్నారు.ఇక ఒకే చోట పోలింగ్ కేంద్రాలు ఉన్న చోట వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నారు. ఏమాత్రం నిబంధనలు అతిక్రమించినా వెంటనే అడ్డుకునేలా అడుగడుగునా సిబ్బందిని మెహరించారు. నగరంలో ఐదుగురికి మించి గుమిగూడకుండా ఆంక్షలను అమలు చేస్తున్నారు. అల్లర్లకు అవకాశం లేకుండా 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. మద్యం దుకాణాలు మూసేయాలని తెలిపారు.

ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో..ఉమ్మడి జిల్లాలోని నల్గొండ లోక్‌సభ స్థానానికి నల్గొండ, భువనగిరి స్థానాల కౌంటింగ్ భువనగిరిలోనే వేర్వేరుగా జరగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభించి అనంతరం ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఒక్కో హాలులో అసెంబ్లీ నియోజకవర్గాలను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలను ప్రకటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి కౌంటింగ్ రౌండ్ల సంఖ్య ఉంటుంది. ఉదయం 11 గంటల వరకు ఫలితాల సరళి ప్రకటించనుండగా, సాయంత్రం అధికారికంగా తుది ఫలితం వెలువడనుంది.

క‌రీంన‌గ‌ర్ లో..

కరీంనగర్ లోక్ సభ స్థానం ఓట్ల లెక్కింపుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం ఓటర్లు 17,9810 కాగా.. పోలైన ఓట్లు 13,0290, పోలింగ్ శాతం 72.71% ఉన్నాయి. ఉదయం 8:00 గంటలకి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్లు,ఈవియంలు ఒకేసారి లెక్కించాలని ఎలెక్షన్ కమిషన్ సూచించారు. పోస్టల్ బ్యాలెట్లకు ప్రత్యేక రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గం నుండి ఐదు వివి ప్యాట్ల నుండి స్లిప్పులు లెక్కించాలని సూచించారు.

వ‌రంగ‌ల్ లో..

వరంగల్ లోకసభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధమైంది. వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు వారిగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు. వరంగల్ తూర్పు నియోజకవర్గం 17 రౌండ్లు ఉండడంతో లెక్కింపు మొదట పూర్తి కానుంది. తొలిత పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్, సర్వీస్ ఓట్లను గోదాం సంఖ్య 18c లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 14 టేబుల్ పై లెక్కించనున్న అధికారులు. ఏడు సెగ్మెంట్లకు గాను మొత్తం 124 టేబుల్స్ పై 127 రౌండ్ లెక్కించనున్నారు. వరంగల్ బరిలో 42 మంది అభ్యర్థులు ఉండగా మొత్తం పోలింగ్ శాతం 68.86.. మొత్తం ఓటర్ల సంఖ్య 18, 24,466 గాను ఇంకా 12,56,31 ఓట్లు నమోదయ్యాయి.

మ‌హ‌బూబాబాద్ లో..

మహబూబాబాద్ జిల్లోని లోక్ సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజులు ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. మహబూబాబాద్ లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో జరిగే మహబూబాబాద్ లోకసభ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు దీని పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాట్లు చేయాల్సిన టేబుల్ లను సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభిస్తారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 టేబుల్ చొప్పున మొత్తం 98 ని ఏర్పాటు చేశారు. పార్లమెంటరీ పరిధిలో ప్రతి రౌండ్ కు 98 ఈవీఎం లను లెక్కిస్తారు. మొత్తంగా 132 రౌండ్లలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత చివరి ఫలితం తెలుస్తుంది. అత్యధికంగా ములుగు శాసనసభ నియోజకవర్గంలో 22 ,అత్యల్పంగా భద్రాచలంలో 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. ఏడు నియోజకవర్గాలకు కలిపి దాదాపుగా 750 మంది ఉద్యోగులు లెక్కింపులో పాల్గొననున్నారు.

ఖ‌మ్మంలో..ఖమ్మం పార్లమెంటు ఎన్నికకు సంబందించిన కౌంటింగ్ ఏర్పాట్లను అన్ని పూర్తిచేసినట్లుగా జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ చెప్పారు. పార్లమెంటు పరిదిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కు ప్రత్యేకంగా కౌంటింగ్ కేంద్రాలు అదే విదంగా పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక్క కౌంటింగ్ కేంద్రాన్ని మొత్తం ఎనిమిది రూమ్ లలో కౌంటింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మం అసెంబ్లీ పరిదిలో అత్యదికంగా ఓట్లు ఉన్నందున ఖమ్మం కౌంటింగ్ కేంద్రంలో 18 టేబుళ్లు , అదేవిదంగ తక్కువ ఓగట్లు ఉన్న అశ్వరావు పేట 14 టేబుల్లను ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్న జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్ తెలిపారు.

సంగారెడ్డిలో

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బరిలో 19 మంది అభ్యర్థులు కాగా.. మొత్తం 16 లక్షల 41 వేల 410 ఓట్లకు గాను పోలైన 12 లక్షల 25 వేల 49 ఓట్లు ఉన్నాయి. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున మొత్తం 98 టేబుళ్లు ఏర్పాటు చేశారు. అత్యధికంగా ఆందోల్, జహీరాబాద్ సెగ్మెంట్ కి 23 రౌండ్లు, నారాయణఖేడ్ 22, బాన్సువాడ, ఎల్లారెడ్డి 20, జుక్కల్, కామారెడ్డి 19 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ముందుగా పోలైన 10 వేల 832 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను 14 టేబుళ్లపై ఒకే రౌండ్ లో లెక్కింపు చేయన్నారు

.మెద‌క్ లో

మెదక్ లోక్ సభ ఓట్ల లెక్కింపుకి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. మొత్తం 18 లక్షల 28 వేల 210 ఓట్లకు గాను పోలైన 13 లక్షల 72 వేల 894 ఓట్లు కాగా.. మెదక్ నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. రెండు చోట్ల మెదక్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపు జరగనుంది. నర్సాపూర్ అల్లూరి గురుకులంలో సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపు కార్యక్రమం నిర్వహించనున్నారు. బివిఆర్ ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గ ఓట్ల లెక్కించనున్నారు. ముందుగా పోలైన 14, 297 పోస్టల్ బ్యాలెట్ ఓట్లను రెండు రౌండ్లలో లెక్కించనున్న అధికారులు. 199 సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణలో ఉండనున్నాయి.

. 10 మంది డీఎస్పీలు, 15 మంది సీఐలు, 45 మంది ఎస్సైలతో మొత్తం 650 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు

.ఎన్నిక‌ల బ‌రిలో కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్

ఈ ఎన్నిక‌ల‌లో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి, బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ నుంచి, మ‌ల్కాజీగిరి నుంచి ఈట‌ల రాజేంద‌ర్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి డికె అరుణ బిజెపి అభ్య‌ర్ధులుగా పోటీ చేస్తున్నారు.. ఇక క‌రీంన‌గ‌ర్ నుంచి బిఆర్ఎస్ అభ్య‌ర్ధిగా బి వినోద్ కుమార్, మెద‌క్ నుంచి కాసాని జ్ఞానేశ్వ‌ర్ , సికింద్రాబాద్ నుంచి ప‌ద్మారావు బ‌రిలో ఉన్నారు.. ఇక కాంగ్రెస్ అభ్య‌ర్ధులు గా పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ క్రిష్ణ, మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి.. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి , నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవిలు త‌మ అదృష్ణాన్ని ప‌రిక్షించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement