Saturday, September 7, 2024

Suryapet – దొంగ‌ జంప్… ఇద్ద‌రు కానిస్టేబుల్స్ స‌స్పెండ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, గ‌రీడేప‌ల్లి ( సూర్యాపేట జిల్లా) : బ్యాట‌రీ దొంగ‌త‌నం చేసిన కేసు నిందితుడు ప‌రారైన సంఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు పోలీసు కానిస్టేబుళ్ల స‌స్పెండ్ చేస్తూ సూర్యాపేట ఎస్‌పీ స‌న్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సంఘ‌ట‌న‌కు సంబంధించి ఎస్సై సైదుల‌కు మెమో జారీ చేశారు. రెండు రోజుల కింద‌ట నిందితుడి ని ప‌ట్టుకున్నారు. అయితే అత‌డు అనూహ్యంగా ప‌రార‌య్యాడు. దీంతో డ్యూటీలో నిర్ల‌క్ష్యం వ‌హించిన స‌త్య‌నారాయ‌ణ‌, శ్రీ‌నివాస్‌ల‌ను ఎస్‌పీ స‌స్పెండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement