Friday, September 20, 2024

Suicide – పగిడేరులో వృద్ధ దంపతులు ఆత్మహత్య

మణుగూరు, ,(ప్రభ న్యూస్):మండల పరిధిలోని పగడేరు పంచాయతీలో ఎస్టీ కాలనీలో నివాసముంటున్న కాసరబాదా రామచంద్రయ్య(75), సరోజినమ్మ(69), అనే వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

పాల్పడ్డిన ఘటన ఆదివారం రాత్రి గ్రామ సమీపంలోని, వ్యవసాయ పొలాల్లో బావిలో దూకి ఆత్మహత్యకు ఘటన చోటు చేసుకుంది. ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధ దంపతుల్లో సరోజినమ్మ మృతదేహాన్ని బయటకు తీశారు.స్థానికులు నాటు వేసి తిరుగు వేసి వస్తున్న క్రమంలో,పోలాల మధ్య ఉన్న బాయి వైపు చూడగా,సరోజిని మృత దేహం పైకి తేలుతూ ఉండగా,ఈ విషయాన్ని గ్రామస్థుల కు చేరవేశారు

.ఈ ఘటన లో చంద్రయ్య మృతదేహం కోసం బావిలో గాలిస్తున్నారు.ఈ విషయాన్ని మణుగూరు పోలీసులకు సమాచారం చేరవేయడంతో, ఘటన ప్రాంతానికి మణుగూరు ఎస్సై మేడ ప్రసాద్ సందర్శించి ఆత్మహత్య గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

చంద్రయ్య, సరోజనమ్మ వృద్ద దంపతులకు ముగ్గురు కుమారులు మీరు పగిడేరురులోని, గొల్ల కొత్తూరు గ్రామంలో నివసిస్తుండగా, వృద్ధ దంపతులు ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆత్మహత్య గల కారణాలు తెలియ రాలేదు. వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం పగిడేరులో కలకలం రేపింది. వీరు గ్రామంలో అందరితో మంచి సత్స, సంబంధాలు కలిగి ఉండేవారు. ఆత్మహత్యకు పాల్పడ్డ తల్లిదండ్రుల విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఘటన ప్రాంతానికి చేరుకొని కన్నీరు,మున్నీరు అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement