Friday, October 18, 2024

Suicide – కొత్తపేటలో విషాదం – తల్లీ, కుమారుడు బలవన్మరణం

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – : హైదరాబాద్ కొత్తపేటలో విషాదం చోటు చేసుకుంది. కొత్తపేటలో తల్లీ కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులతో రాత్రి ఉరేసుకుని తల్లి పద్మ ఆత్మహత్య చేసుకోగా..తల్లి మరణం తట్టుకోలేక కుమారుడు వంశీ సూసైడ్ చేసుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని వంశీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను ఒంగోలు వాసులుగా గుర్తించారు.

వివరాలలోకి వెళితే తల్లీ కొడుకుల ఆత్మహత్య.కొత్తపేట లోని ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ లో అద్దెకు ఉంటున్న ఒంగోలుకు చెందిన గుంజి శివ తన భార్య పద్మ తన ఇద్దరు కుమారులతో కలసి జీవనోపాధి కోసం కొన్నేళ్ల క్రితం ఎస్‌ఆర్‌ఎల్‌ కాలనీ కొత్తపేటకు వచ్చారు.ఈ క్రమంలో గుంజు శివ కొన్ని నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఆర్థిక ఇబ్బందులతో గుంజి పద్మ కొంతకాలం క్రితం కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఖర్చులు భరించలేక ఈరోజు రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.

ఇది చూసిన పెద్ద కొడుకు గుంజి వంశీ ( 18 ) కన్న తల్లి ని చూసి ఒక్కసారిగా షాక్ కు గురై తను కుడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది.ఇదంతా క్షణాలలో జరిగిపోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

- Advertisement -

మృతురాలి రెండో కుమారుడు తన తల్లి మరణ వార్త ను స్థానిక బందువులకు, స్థానికులకు తెలియజేయడానికి వెళ్లి వచ్చే సరికి తన అన్న కుడా ఇలా ఆత్మ హత్య కు ఒడిగట్టడం తో, కండ్ల ముందే తల్లి తోడ బుట్టినవాడు ఇలా అర్ధంతరంగా నన్ను ఒంటరిని చేసి వెళ్లి పోయారా అంటూ కన్నీరు మున్నీరుగా విలపించడం జరిగింది.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకుని, మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి,మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టడం జరిగింది.దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement