Sunday, September 8, 2024

TS: నల్గొండ జిల్లాలో విద్యార్థి ఆత్మహత్య

ఆత్మకూర్ ఎస్, ప్రభ న్యూస్ : మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్ది ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఆలకుంట్ల వెంకన్న- జయలక్ష్మీ దంపతుల కుమారుడు రాకేష్ మహాత్మా జ్యోతిభా ఫూలే బిసి సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.

పాఠశాలలో టాయిలెట్స్ ఎదురుగా ఉన్న రేకుల షెడ్డుకు ఉరి వేసుకుని చనిపోయినట్టు గుర్తించిన తోటి విద్యార్దులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement