Thursday, September 12, 2024

MDK: పాము కాటుకు విద్యార్థిని మృతి…

కౌడిపల్లి, ఆగస్టు 24 (ప్రభ న్యూస్) : పాము కాటుకు విద్యార్థిని మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బుజరంపేట గ్రామపంచాయతీలోని వెంకటాపూర్ గ్రామంలో ఇవాళ‌ చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే… వెంకటాపూర్ గ్రామానికి చెందిన తుండ్రు స్వప్న, వీరేశంల కూతురు వైష్ణవి (13) శుక్రవారం రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో నూనెకట్ల పాము వైష్ణవిని కాటేసింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మెదక్ ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ వైష్ణవి మృతి చెందింది. విద్యార్థిని బుజరంపేట పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement