Saturday, October 19, 2024

TG | గ్రూప్-1 మెయిన్స్ కు పటిష్ఠ బందోబస్తు : డీజీపీ

కోర్టు ఆదేశాల ప్రక‌రామే గ్రూప్-1 పరీక్షలు జ‌రుగుతాయ‌ని, హైకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

గ్రూప్-1 మెయిన్స్‌కు పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.. నిరసనల‌ పేరుతో రోడ్లపైకి వచ్చి ప్ర‌జ‌ల‌ను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

- Advertisement -

ముత్యాలమ్మ దేవాలయం ఘటనపై విచారణ కొనసాగుతోంది

సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాల‌యం ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కేసు విచారణ కొనసాగుతోందని, అందరూ సంయమనం పాటించాలని కోరారు. సికింద్రాబాద్ ఘటనపై ఆందోళనలు సరికాదన్నారు. అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనున్నామని.. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement