Friday, October 18, 2024

Socond Round – ఎమ్మెల్సీ ఉప ఎన్నిక – ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు రెండో రౌండ్ పూర్తయ్యే సరికి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న (నవీన్) 14,672 ఓట్లతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో ఆయనకు 34,575 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డికి 27,573, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డికి 12,841 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 11,018 మొదటి ప్రాధాన్యత ఓట్లు లభించాయి.

తొలి రెండు రౌండ్లలో తీన్మార్ మల్లనకు 70,785, రాకేశ్‌రెడ్డికి 56,113, ప్రేమేందర్‌రెడ్డికి 24,236 ఓట్లు పోలయ్యాయి. ఇంకా 1.44 లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉంది. సాయంత్రానికి మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement