Saturday, September 21, 2024

TG: ప్ర‌శ్నించ‌డ‌మే ప్ర‌జాస్వామ్య‌మ‌ని న‌మ్మిన్న వ్య‌క్తి సీతారాం ఏచూరి.. కేటీఆర్

ఏచూరి సంస్మ‌ర‌ణ‌లో స‌భ‌లో కేటీఆర్
సిద్దాంతం చుట్టూ నిల‌బ‌డిన యోధుడు
మౌన‌మే అతి పెద్ద‌ ప్ర‌మాదం అన్న
ఏచూరి జీవితం మాలాంటి వారికి మార్గ‌ద‌ర్శకం


హైద‌రాబాద్ – ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో ఒకే పార్టీలో ఏచూరి నిలబడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఇవాళ‌ జ‌రిగిన సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ.. సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం పోరాడారని తెలిపారు.

ప్రశ్నించడమే ప్రజాస్వామ్యమ‌ని నమ్మిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పార్టీలు సిద్ధాంతాలు వేరుకావొచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మాది రక్త సంబంధం అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మౌనంగా ఉండటం ప్రమాదమ‌ని ఏచూరి చెప్పారని వెల్లడించారు. ఏచూరి చెప్పిన సిద్ధాంతాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మేము పోరాడుతామన్నారు.

- Advertisement -

సీతారాం ఏచూరి జీవితం త‌మ లాంటి యువతరానికి స్పూర్తిదాయకమని తెలిపారు. సీపీఎం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి కేటీఆర్, ఎంఎల్సీ కోదండరాం, పలువురు సీపీఎం నేతలు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement