Monday, September 16, 2024

Siricilla – ప‌వ‌న్‌ కు లైనెన్ కాట‌న్ దుస్తులు గిఫ్ట్….

జ్ఞాపిక‌గా అంద‌జేసిన సిరిసిల్ల కార్మికుడు
జ‌న‌సేన లోగో తో త‌యారు చేసిన వ‌స్త్రం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సిరిసిల్ల : ఏపీ డిప్యూటీ సీఎం, సినీ హీరో ప‌వ‌న్ క‌ల్యాణ‌కు సిరిసిల్ల చేన‌త కార్మికుడు హరి ప్రసాద్ లైనెన్ కాటన్‌తో త‌యారు చేసిన వ‌స్త్రాన్ని బ‌హుక‌రించారు. హ‌రిప్ర‌సాద్ కుటుంబ స‌భ్యుల‌తో క‌ల‌సి సుమారు 25 రోజులు శ్ర‌మించి 100 నెంబ‌ర్ దారంతో లైనిన్ కాట‌న్ ఉప‌యోగించి వ‌స్త్రాన్ని త‌యారు చేశారు. ఇందులో జ‌న‌సేన లోగో కూడా ఉన్న‌ట్టు చూసుకున్నారు. సిరిసిల్లలో లైనిన్ కాటన్ ఉపయోగించి త‌యారు చేయ‌డం ఇదే తొలిసారి.

- Advertisement -

రూ.6 ల‌క్ష‌ల ఆర్డ‌ర్లు ఇచ్చిన ప‌వ‌న్ అభిమాని…
గతంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు జ్ఞాపికను తయారు చేసిన విషయాన్ని తెలుసుకున్న ఆయన అభిమాని ఒకరు హరి ప్రసాద్ కు రూ.6 ల‌క్ష‌ల విలువైన ఆర్డ‌ర్లు ఇచ్చారు. దేశ ప్రధాని మోడీని సైతం హరిప్రసాద్ ప్రతిభ అబ్బుర పరిచింది. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాని కి ఆహ్వానించినా ఆర్థిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో వెళ్ల‌లేక‌పోయినట్లు హరిప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement