Monday, October 21, 2024

Siricilla అమరుల త్యాగాలతోనే శాంతి : జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

చందుర్తి, – ఆంధ్రప్రభ. – పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల వల్లే నేడు శాంతి సామరస్యం ఉందని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. సోమవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ లో భాగంగా పోలీస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని జిల్లా పరిధిలోని చందుర్తి మండలం లింగంపెట్ గ్రామ శివారులో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ఘన నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ ఎందరో పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణ త్యాగం చేశారని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందన్నారు. పోలీసులు 24 గంటల పాటు శ్రమించడం వల్ల శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement