Friday, October 18, 2024

Singareni ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు అండగా ఉంటాం – సింగరేణి సంస్థ సిఎండి బలరామ్‌

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – రామగుండం- 3 ఏరియాలోని ఓపెన్ కాస్ట్ -2 గనిలో జరిగిన ప్ర‌మాద‌ దుర్ఘటనలో ఇద్ద‌రు కార్మికులు ఫిట్టర్ ఉప్పు వెంకటేశ్వర్లు , జనరల్ మ‌జ్దూర్ విద్యా సాగ‌ర్‌ మృతి చెందడం పై సింగరేణి సంస్థ ఛైర్మ‌న్‌ , ఎండి ఎన్.బలరామ్‌ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

వారి కుటుంబాల‌కు అన్ని విధాలుగా అండగా నిలుస్తామ‌ని ప్రకటించారు. ఇటువంటి ప్రమాదాలు భ‌విష్య‌త్ లో జ‌ర‌గ‌కుండా ప‌టిష్ట‌మైన‌ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్ని స్థాయిల అధికారులను, ఉద్యోగులను ఆదేశించారు. అలాగే ఈ ప్ర‌మాద‌ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement