Tuesday, September 17, 2024

Siddipet – ప‌ద్మ‌శాలి సామాజిక‌వ‌ర్గ‌ సంక్షేమానికి కృషి చేస్తా… మంత్రి పొన్నం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సిద్ధిపేట : ప‌ద్మ‌శాలి సామాజిక వ‌ర్గ సంక్షేమానికి కృషి చేస్తున్నామ‌ని రాష్ట్ర మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ అన్నారు. శుక్ర‌వారం హుస్నాబాద్ పద్మశాలి నగర్ లో రూ.45 లక్షలతో పద్మశాలి కమ్యూనిటీ హల్ రీడింగ్ రూం కు శంకు స్థాపన చేశారు. కమ్యూనిటీ హాల్, రీడింగ్ రూం నిర్మాణాన్ని త్వరగా చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. నేతన్న బంధు కు సంబంధించి రూ.30 కోట్లు నేతన్న బకాయిలు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. జీవో నెంబర్ 1 ద్వారా నేతన్న ఉత్పత్తి చేసే ప్రతి వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి పాఠశాలకు తదితర అవసరాలకు వినియోగించుకుంటామని అన్నారు.

హుస్నాబాద్‌లో టెక్స్ టైల్స్‌
హుస్నాబాద్ లో హాండ్లమ్స్ అండ్ టెక్స్ టైల్స్ తదితర అభివృద్ధికి ప్రభుత్వపరంగా చేయాల్సిన అంశాల పై ప్రాజెక్ట్ తయారు చేయాలని అధికారులను కోరినట్లు తెలిపారు. షెడ్ల నిర్మాణం, మగ్గాలు చేనేత వర్గానికి సంబంధించి ఆర్థికంగా ఎదగడానికి ప్ర‌తిపాద‌న‌లు త‌యారు చేయాల‌ని సూచించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement