Saturday, October 19, 2024

BREAKING: ఎస్సైకి కోపం.. వారికి శిరోముండనం..

బాధ్యతాయుతమైన హోదాలో ఉండి ఓ ఎస్సై దాష్టీకానికి ఒడిగట్టిన అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లింగాల ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు స్థానికంగా ఉన్న పెట్రోల్ బంక్ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే బంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేయగా.. ఎస్సై జగన్ స్పాట్‌కు చేరుకుని ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం వారిని సిబ్బంది సాయంతో స్టేషన్‌కు తరలించారు.

అయితే, తమ ముందు తల దువ్వుకున్నారనే కారణంతో సదరు ఎస్సై ఆ ముగ్గురు యువకులకు ఏకంగా శిరోముండనం చేయించాడు. ఈ క్రమంలో అందులో ఓ యువకుడు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో గమనించిన స్థానికులు అతడిని నాగర్ కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement