Thursday, October 3, 2024

TG: మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి నవరాత్రి ఉత్సవాలు… బండి సంజయ్ ప్రత్యేక పూజలు

కరీంనగర్ కల్చరల్, ఆంధ్ర ప్రభ : దేవీ నవరాత్రి ఉత్సవాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మహాశక్తి ఆలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి వేడుకల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుండి భవాని మాలాదారులతో పాటు భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తొలి రోజు వేడుకల్లో పాల్గొని బాలాత్రిపుర సుందరిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమ్మవారు తెలంగాణ ప్రజలను చల్లగా చూడాలని, సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకున్నామన్నారు. నవరాత్రి వేడుకలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహాశక్తి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement