Saturday, September 7, 2024

TS: ఆర్డీవో కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్… దగ్ధమైన విలువైన భూసేకరణ పత్రాలు

ప్రభ న్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో బీరువాలో భద్రపరిచిన విలువైన సుమారు (15 ఫైల్స్) భూసేకరణ పత్రాలు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఘటనపై గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

దగ్ధమైన పత్రాల్లో కాలేశ్వరం మేడిగడ్డ, సింగరేణి, కేటీపీపీలో భూములకు చెల్లించే విలువైన ఫైల్స్ వున్నాయి. అధికారులు మాత్రం సాఫ్ట్ కాఫీలు సిష్టం, ఆన్ లైన్ లో భద్రంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా..? లేదా ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement