Friday, September 20, 2024

Shamshabad – ఇలా విమానాలు దిగారు .. అలా మృతి చెందారు..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌ర‌బాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన కొద్దిసేపటికే ఇద్దరు ప్రయాణికులు కుప్పకూలిన ఘటన చోటు చేసుకుంది. గురువారం గోవా నుంచి వచ్చిన నితిన్ షా, జడ్డా నుంచి వచ్చిన షేక్ సకినా ఎయిర్ పోర్టులో దిగిన తర్వాత ఒక్కసారిగా ఇద్దరు ప్రయాణికులు అస్వస్థత గురై కుప్పకూలిపోయారు. దీంతో వారిని చికిత్సకోసం ఎయిర్ పోర్టులోని అపోలో ఆస్పత్రికి ఎయిర్ పోర్టు అధికారులు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

వేర్వేరు విమానాల్లో దిగారు…
మృతి చెందిన ఇద్దరు ప్రయాణికులు..వేర్వేరు విమానాల్లో.. వేర్వేరు ప్రాంతాల నుంచి.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగారు. విమానం దిగి.. రన్ వే పైనుంచి ఎయిర్ పోర్టులోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement