Friday, October 25, 2024

Shamshabad – ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు ..

శంషాబాద్: దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్‌లు వస్తుండటం సంచలనం సృష్టిస్తోంది. తాజాగా హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబ్ పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బందికి ఫోన్ చేశారు. దీంతోఅప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు. విమానంలో ఉన్న 130 మంది ప్రయాణికులు కిందకు దింపి త‌నిఖీలు నిర్వ‌హించారు.. బాంబులు లేక‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరిపీల్చుకున్నారు.. అనంత‌రం ఆ విమానం చండీగ‌డ్ కు బ‌య‌లుదేరి వెళ్ళింది.

బాంబు బెదిరింపు ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నారు. ప్రయాణికులు దైర్యంతో ఉండాలని, భయపడాల్సిన పని లేదని అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులో బాంబు పెట్టినట్లు ఎవరు కాల్ చేశారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement