Saturday, September 7, 2024

Secundrabad – బోనాలకు ప‌క‌డ్బందీ ఏర్పాట్లు – దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు

భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి
వీఐపీల ప్రొటోకాల్‌పై జాగ్ర‌త్త‌గా ఉండాలి
బోనాల ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష
సికింద్ర‌బాద్ అమ్మ‌వారి టెంపుల్ ప‌రిశీల‌న‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్: బోనాలు సంద‌ర్భంగా భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేయాల‌ని దేవాదాయ శాఖ, ఐ అండ్ పీఆర్‌ క‌మిష‌న‌ర్ హ‌నుమంత‌రావు అన్నారు. గురువారం సికింద్ర‌బాద్ ఉజ్జ‌యినీ అమ్మ‌వారి టెంపుల్ ఏర్పాట్ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా బోనాల ఏర్పాట్ల‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఆషాఢ‌ మాసం సంద‌ర్భంగా బోనాల ఉత్స‌వాలు హైద‌రాబాద్‌ న‌గ‌రంలో ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని, ఆల‌యాల‌కు వ‌చ్చే భ‌క్తుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. అలాగే.. వీఐపీలు వ‌చ్చేట‌ప్పుడు ప్రోటోకాల్ పాటించాల‌న్నారు. ఈ స‌మీక్ష‌లో దేవాదాయ శాఖ అధికారులు రీజిన‌ల్‌, జాయింట్ క‌మిష‌న‌ర్‌, సికింద్రాబాద్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్‌, హైద‌రాబాద్ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement