Sunday, September 8, 2024

Sangareddi – లారీ – బైక్ ఢీ – ముగ్గురి దుర్మరణం

సంగారెడ్డి, (ప్రభ న్యూస్):సంగారెడ్డి జిల్లా కంది మండలం తునికిళ్ల తండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. నాందేడ్ అకోలా జాతీయ రహదారిపై లారీని బైక్ వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు.

యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు అభిషేక్, సందీప్, నవీన్ గా గుర్తించారు. పుల్కల్ మండలం ఇసాజి పేట,గంగోజి పేట గ్రామానికి చెందిన వారిగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement