Wednesday, September 18, 2024

TG: హత్య కేసులు చేదించిన అధికారులకు సత్కారం..

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : హత్య కేసులను చేదించడంతో పాటు నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులను రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా సత్కరించారు. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్, మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, శ్రీరాంపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ లు గతంలో పని చేసినటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసుల్లో కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ కి పంపించడంతో పాటు త్వరితగతికన కేసును పూర్తి సాక్షాధారాలతో కోర్టుకు ఛార్జ్ షీటు దాఖలు చేసి నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసినందుకు గాను తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రశంసా పత్రాలు అందజేశారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సబ్ డివిజన్ ఏసీపీగా పనిచేస్తున్న ఎం.రమేష్ గతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్ ఇన్ స్పెక్ట‌ర్ గా 2019 సంవత్సరంలో పనిచేస్తున్న సమయంలో క్రైమ్ నెంబర్ 293/19 అండర్ సెక్షన్ 302 ఐపిసి సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి త్వరితగతికన విచారణ జరిపి నేరస్తుని అరెస్టు చేసి జ్యూడిషల్ రిమాండ్ కు పంపడం జరిగింది. అనంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రాసిక్యూషన్ తరపున తమ వాదనలు సాక్షాదారాలతో నిరూపించగా నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించడం జరిగింది. ఇందుకుగాను ఏసీపీ రమేష్ ను రాష్ట్ర డీజీపీ జితేందర్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement