Saturday, September 7, 2024

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో కార్పొరేట్ స్థాయి వ‌స‌తులు …

హైదరాబాద్‌ : . సనత్‌నగర్‌లో 2.22 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులు, బన్సీలాల్ పేటలోని ప్రభుత్వ పాఠశాలలో 1.84 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ లు ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రులు మాట్లాడుతూ, విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని అన్నారు.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మేకల మండి పాఠశాలను హై స్కూల్‌గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి సబిత ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పేద విద్యార్థులు అధికంగా విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో మన బస్తీ -మన బడి కార్యక్రమంతో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, వారానికి 3 రోజులు రాగి జావా అందిస్తున్నామని గుర్తు చేశారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement