Wednesday, October 9, 2024

TG | రైతుబంధు కుంభకోణం… తహసిల్దార్ అరెస్ట్ !

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ రైతుబంధు కుంభకోణం వెలుగుచూసింది. లేని భూమిని సృష్టించి భారీ స్కాంకు పాల్పడిన తహసిల్దార్‌ జయశ్రీతో పాటు ఆపరేటర్‌లను అరెస్ట్‌ చేసి 14 రోజులు రిమాండ్‌ తరలించారు. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తాసిల్దార్‌గా పనిచేస్తున్న జయశ్రీ గతంలో హుజూర్‌నగర్‌ తాహసిల్దార్‌గా పని చేశారు.

ఈ క్రమంలో హుజూర్‌నగర్‌, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసుపుస్తకాలు పొంది రైతుబంధు నిధులు కాజేశారు. మొత్తం రూ.14,63,004 రైతుబంధు నిధులు తహసిల్దార్‌, ధరణి ఆపరేటర్‌ కలిసి దారి మళ్లించారు. తహసిల్దార్‌ జయశ్రీ ధరణి ఆపరేటర్‌ జగదీష్‌ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు జారీ చేసింది.

ఈక్రమంలో ఆ భూములకు రైతు బంధు కింద వచ్చిన మొత్తాలను తహసిల్దార్‌, పట్టాదారులు సగం సగం పంచుకున్నారు. తహసల్దార్‌, ధరణి ఆపరేటర్‌ జగదీష్‌తో కలిసి రైతుబంధు నిధులు కాజేసినట్లు తేలడంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement