Friday, October 4, 2024

ADB: పల్లెల అభివృద్ది బీజేపీతోనే సాధ్యం… ఎంపీ నగేష్

జన్నారం, అక్టోబర్ 4 (ప్రభ న్యూస్): గ్రామాల అభివృద్ధి బీజేపీ పార్టీతోనే సాధ్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో పార్టీ సభ్యత్వాన్ని ఎంపీ, ఖానాపూర్ బీజేపీ అసెంబ్లీ నేత రితీష్ రాథోడ్, సభ్యత్వ కన్వీనర్ ఆకుల శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ప్రజలంతా కాంగ్రెస్ పాలనలో విసిగిపోయారన్నారు. ప్రస్తుతం ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని, బీజేపీతోనే అన్ని సాధ్యమని ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆదరణ పొందేలాగా చూడాలని ఆయన తెలిపారు.

ఈ నేపథ్యంలోనే సభ్యత్వాలు చురుగ్గా చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు జి.మధుసూదన్ రావు, జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎస్టీ మోర్చాజిల్లా అధ్యక్షుడు బద్రీనాయక్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గాజుల దేవేందర్, మాజీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు బెదడ గోపాల్, యువజన అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షులు వీరచారి గోలిచందు, టౌన్ అధ్యక్షుడు రాగుల సూర్యం, నేతలు అప్పాల జలపతి, జగన్, పవన్ యాదవ్ వేయికండ్ల రవి, గోపాల్, రవి నాయక్, బోడ తిరుపతి, ముక్కెర మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement