Saturday, September 21, 2024

TG: పట్టపగలే చోరీ.. కారులోని రూ.10లక్షలు అపహరణ..

జోగిపేట, ఆగస్టు12 (ప్రభ న్యూస్) : జోగిపేట మున్సిపల్ పట్టణంలో సోమవారం పట్టపగలే భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు పార్క్ చేసి ఉన్న కారు అద్దాలు పగులగొట్టి… కారులో ఉన్న రూ.10 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ ఏడీ రవీందర్ రెడ్డి డబ్బులు డ్రా చేసేందుకు కారులో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్ బీఐ బ్యాంకుకు ఇవాళ‌ వచ్చారు.

ఆయ‌న‌ కుమారుడైన సాయి కిరణ్ రెడ్డి అకౌంట్ నుంచి సెల్ఫ్ చెక్కుతో రూ.10 లక్షల డబ్బులు డ్రా చేసుకొని తిరిగి బ్యాంకు నుంచి బయటకు వచ్చి కారులో పక్క సీట్లో నగదు పెట్టుకొని వెళ్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు స్వీటు తీసుకునేందుకు రోడ్డు పక్కన కారు ఆపి స్వీటు కొనేందుకు దుకాణానికి వెళ్లారు. ఇంతలోనే గుర్తుతెలియని దొంగలు ఇది గమనించి కారు అద్దం పగలగొట్టి కారులో ఉన్న పది లక్షల నగదును ఎత్తుకెళ్లారు.

కారు దగ్గరికి వచ్చి డోర్ తీసి చూడడా డబ్బులు కనిపించకపోవడంతో రవీందర్ రెడ్డి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సిఐ అనిల్ కుమార్ వారి సిబ్బందితో కలిసి బ్యాంకుకు చేరుకొని బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్ లను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితుడు రవీందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement