Tuesday, September 17, 2024

TG: పంజాగుట్టలో రోడ్డు ప్రమాదం.. ఎస్పీఎఫ్ ఎస్ఐ కూతురు మృతి

హైదరాబాద్ లోని పంజాగుట్టలో ఇవాళ‌ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న టెంపో వాహనం బైక్ ను ఢీకొట్టింది. దీంతో బైక్ వెళ్తున్న మణుగూరు ఎస్పీఎఫ్ ఎస్ఐ కూతురు ప్రసన్న అక్కడికక్కడే మృతి చెందగా.. ఎస్ఐ శంకర్రావుకు తీవ్ర గాయాలయ్యాయి.

కాగా ఎస్ఐ తన కూతురితో కలిసి బేగంపేట నుంచి పంజాగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ప్రమాదంలో గాయపడిన ఎస్ఐని హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement