Saturday, September 14, 2024

RIP – సినీ గేయ రచయిత “వడ్డేపల్లి కృష్ణ ‘ఇక లేరు..!

సిరిసిల్ల సెప్టెంబర్ 6 (ప్రభ న్యూస్) సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ ఇక లేరు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాదులోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో చేనేత కుటుంబం నుంచి ఏది గోచ్చిన వడ్డేపల్లి కృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి మొదలైన వడ్డేపల్లి కృష్ణ తన సాహిత్య సృజనతో జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు.

లలితగీత రచయితగా, వడ్డేపల్లి కృష్ణ ప్రామాణిక పరిశోధకుడిగా, టెలివిజన్ ధారావాహికల దర్శకుడిగా, గీత రచయితగా, వివిధ డాక్యుమెంటరీల రూపకర్తగా, అనేక పుస్తకాలతో పాటు, ఆడియో ఆల్బమ్ ల రూపకర్తగా, సంగీత, నృత్య రూపకాల రచయితగా, వివిధ నాటక రచయితగా, విభిన్న కోణాల్లో తన రచనా నైపుణ్యం తో సాహిత్య సేవలు అందించారు. మానేరు గడ్డమీద నుంచి ఎదిగోచ్చిన వడ్డేపల్లి కృష్ణ తెలుగు సినీ సాహిత్యంలో ప్రత్యేక ముద్ర వేశారు. వడ్డేపల్లి కృష్ణ మృతి పట్ల పలువురు సాహిత్యాభిమాని సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement