Friday, September 13, 2024

RIP – గుండెపోటుతో ఏఎస్సై మృతి

నిజామాబాద్ ప్రతినిధి ఆగస్ట( ప్రభ న్యూస్)21:నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ ఏఎస్ఐ దత్తాద్రి (56)ఇంట్లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుతో మృతి చెందాడు. బుధవారం నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్ లో నివాసం ఉంటున్న ఏఎస్ఐ దినచర్యలో భాగంగా ఉదయం 6 గంటల ప్రాంతంలో వ్యాయామం చేస్తు న్నారు. ఈ క్రమంలో హఠాత్తుగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబీకులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.

- Advertisement -

అంతకు ముందు బోధన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించాడు. పదోన్నతి లో భాగంగా 2 సంవత్సరాలుగా నిజామాబాద్ ఒకటవ టౌన్ లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తు న్నాడు. ఏఎస్ఐ మృతి విషయం తెలుసు కున్న తోటి పోలీస్ సిబ్బంది షాక్ కు గురయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement