Tuesday, July 2, 2024

RIP రాథోడ్ ర‌మేష్ కు బండి సంజ‌య్ నివాళి

ఉట్నూర్ జూన్ 30 (ప్రభన్యూస్) అదిలాబాద్ మాజీ ఎంపీ బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు రాథోడ్ రమేష్ శనివారం మధ్యాహ్నం మృతి చెందడంతో ఈ విషయం తెలుసుకున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల శంకర్ తో క‌లసి ఉట్నూర్ చేరుకున్నారు.. అక్క‌డ రాథోడ్ రమేష్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతి గల కారణాలు కేంద్ర సాయం మంత్రి బండి సంజయ్ రాథోడ్ రమేష్ కుమారుడు రితీష్ రాథోడ్ తో పాటు కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. రాథోడ్ రమేష్ అకాల మరణం చెందడం పార్టీకి సమాజానికి తీరనిలోటని మంచి నాయకున్ని కోల్పోయామని హోంశాఖ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. వారి వెంట బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement