Friday, September 27, 2024

Review – హుస్నాబాద్ అభివృద్ధిపై మంత్రి పొన్నం దృష్టి – మూడు జిల్లాల క‌లెక్ట‌ర్ల‌తో స‌మీక్ష‌

ఉమ్మడి కరీంనగర్, ప్రభ న్యూస్ బ్యూరో : హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం మూడు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. శుక్ర‌వారం హుస్నాబాద్ లో కరీంనగర్, హనుమ‌కొండ, సిద్ధిపేట జిల్లాల‌ కలెక్టర్ల‌తో స‌మావేశ‌మైన ఆయ‌న అభివృద్ధిపై దృష్టి సారించాల‌ని కోరారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌నలో హుస్నాబాద్ నియోజ‌క‌వ‌ర్గం మూడు జిల్లాల ప‌రిధిలోకి వ‌చ్చింద‌ని, దీంతో నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి కుంటుప‌డింద‌ని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల‌ను ముగ్గురు క‌లెక్ట‌ర్ల‌కు, అధికారుల‌కు మంత్రి పొన్నం వివ‌రించారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి, అలాగే నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement