Saturday, October 19, 2024

Revanth vs KTR నా మాటలు గుర్తు పెట్టుకో ‘చీప్’ మినిస్ట‌ర్ …

ఆంధ‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – “నా మాటలు గుర్తు పెట్టుకో ‘చీప్’ మినిస్టర్ రేవంత్… మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే బాబాసాహెబ్ అంబేద్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తాం” అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ విగ్ర‌హాన్ని తొల‌గిస్తే వీపు చింత‌పండే అవుతాది అంటూ కెటిఆర్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే అంబేడ్కర్, సచివాలయం పరిసరాల్లోని చెత్తను తొలగిస్తామన్నారు. నీలాంటి ఢిల్లీ బానిస తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని విమర్శించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం, వ్యక్తిత్వం, ఆయన పెంపకాన్ని సూచిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని చురక అంటించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement