Thursday, September 12, 2024

RR: వికారాబాద్ లో స్వచ్ఛందంగా బంద్..

వికారాబాద్, ఆగస్టు 12 (ప్రభ న్యూస్): బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. హిందూ ఐక్యవేదిక సభ్యులు వికారాబాద్ లోని రామ్ మందిర్ నుండి ఊరేగింపుగా బయలుదేరి పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బీజేఆర్ చౌరస్తా, ఎన్టీఆర్ చౌరస్తా, మహాశక్తి చౌరస్తా, ఎమ్మార్పీ చౌరస్తా మీద ఆలంపల్లి వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువులు మాట్లాడుతూ… బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ కరువైందని, వెంటనే వారికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు రాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చెల్లపల్లి రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలు శిరీష, కేపీ రాజు, వడ్ల నందు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ సదరన్ రెడ్డి, పేట శంకర్ యాదగిరి అమర్నాథ్, సత్యనారాయణ గౌడ్, కేపీ రాజు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, మహిళా మర్చ్ నాయకులు మాధవి, కాంగ్రెస్ నాయకులు సుభాన్ రెడ్డి, కే శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement