Monday, October 14, 2024

RR: బైకును ఢీ కొట్టిన లారీ… మహిళ పరిస్థితి విషమం

కొత్తూరు, జూన్ 21(ప్రభ న్యూస్): కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలోని వై జంక్షన్ సమీపంలో బైక్ ను లారీ డీకొట్టింది. ఈ ఘటనలో కొత్తూరు మండల పరిధిలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన పద్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. పద్మమ్మ కుడి కాలుపై నుండి లారీ వెళ్లడంతో కాలు భాగం చిద్రమయ్యింది.

సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు స్వీకరిస్తున్నారు. కాగా మహిళ పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు విచారాన్ని వ్యక్తం చేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement