Friday, September 20, 2024

భూమి విని‌యోగం పై పవర్ పాయింట్ ప్రజంటేషన్

కుత్బుల్లాపూర్, – దుండిగల్ మున్సిపల్ లో ల్యాండ్ యూస్ పై మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు.. దుండిగల్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో సాంకేతిక నిపుణులు ల్యాండ్ యూస్ పై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు.. గాగిల్లాపూర్ వార్డ్ పరిధిలో రూపోందించిన “ల్యాండ్ యూస్ ప్లాన్” ప్రజంటేషన్ ను కమిషనర్ జ్యోతితో పాటు సిబ్బంది, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో జిఐజ‌డ్ ప్రతినిధులు, మునిసిపల్ మేనేజర్ ఎస్. సునంద, మునిసిపల్ ఇంజనీర్ పి. ప్రవీణ్ కుమార్ , మునిసిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి, భాస్కర్, జగన్ మోహన్ రెడ్డి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పి. సాత్విక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement