Tuesday, September 17, 2024

RR: ప్రజలు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.. కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్, ఆగస్టు 17 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలెవరికైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడి, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ, ప్రైవేట్ ఆస్పత్రులలో కానీ వైద్య సేవలు పొందడంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నట్లైతే ఈ క్రింద తెలిపిన వాట్సప్ నెంబర్ 7780478817 కు మెసేజ్ ద్వారా సమాచారం అందించగలరని కోరారు.

ఈనెంబర్ కు సమాచారం అందిన వెంటనే మీ సమస్య పరిష్కరించడం కోసం తమ బృందం మీకు అందుబాటులో ఉండి సహాయపడుతుందని జిల్లా ప్రజలకు కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement