Saturday, September 7, 2024

గుండ్లపోచంపల్లిలో వ్యక్తి దారుణహత్య

మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లిలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మృతుడు మహారాష్ట్రకు చెందిన‌ బాబు (40) గా గుర్తించారు. మృతుని తలపై బండరాయితో మోది హత్య చేశారు. సమాచారం అందుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement